అల్లు అర్జున్ హంగామా వైజాగ్ నుండి మొదలుకానుంది

అల్లు అర్జున్ హంగామా వైజాగ్ నుండి మొదలుకానుంది

Published on Oct 27, 2020 9:08 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చిత్రీకరణను త్వరలో రీస్టార్ట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. నవంబర్ నెల నుండి షూట్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ ఎక్కువ భాగం అడవుల్లోని జరగనుంది. అయితే ఫారెస్ట్ లొకేషన్లకు వెళ్లే ముందు వైజాగ్లో కొద్దిగా షూటింగ్ చేయాల్సి ఉందట. అక్కడ మూడు రోజుల పాటు షూట్ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అందులో అల్లు అర్జున్ సహా పలువురు ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. అది ముగిశాక మళ్ళీ ఫసర్స్ లొకేషన్లకు వెళ్లి చిత్రీకరణ చేస్తారు. కొన్ని పాటలను కూడ ఈ షెడ్యూల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బన్నీ పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నారు. బన్నీ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు