ఎంటర్టైనర్ ఆన్ ది వే అంటున్న అల్లు శిరీష్

ఎంటర్టైనర్ ఆన్ ది వే అంటున్న అల్లు శిరీష్

Published on Mar 30, 2020 5:10 PM IST

గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు శిరీష్. అన్ని పనులు పూర్తై సినిమా ఈపాటికే మొదలవ్వాల్సింది. కానీ కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రారంభం వాయిదాపడింది. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపారు.

అంతేకాదు మంచి ఎంటెర్టైనర్ ఆన్ ది వే అని, కొంచెం ఓపిక పట్టాలని ట్విట్టర్ ద్వారా సినిమా ఎప్పుడని అడిగిన అభిమానికి సమాధానమిచ్చారు. ‘ఏబిసిడి’ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న శిరీష్ అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరవ్వాలనే ఉద్దేశ్యతో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ కథను చూజ్ చేసుకున్నారని అర్థమవుతోంది. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు లాక్ డౌన్ తర్వాతే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు