‘పైన ప‌టారం’ లిరికల్ సాంగ్ తో వచ్చిన అన‌సూయ !

‘పైన ప‌టారం’ లిరికల్ సాంగ్ తో వచ్చిన అన‌సూయ !

Published on Mar 1, 2021 7:08 PM IST


యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని అడిగా అనే పాటల‌‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా సినిమా నుంచి అన‌సూయ చిందేసిన‌ ఓ మాస్ ఐటెమ్ సాంగ్ విడుద‌ల చేసారు. ఈ మధ్యే విడుదలైన ప్రోమో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. పైన ప‌టారం లోన లొటారం అంటూ సాగే మాస్ ఐట‌మ్ సాంగ్ లో కార్తీకేయ‌, అన‌సూయ అదిరిపోయే చిందులేసారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తాజాగా మొత్తం పాటను విడుదల చేసారు మేకర్స్. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేసిన మాస్ అభిమానులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న పైన ప‌టారం లోన లొటారం పాట‌ను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు