కరోనా దెబ్బతో ఫిల్మ్ సిటీకి ఫుల్ డిమాండ్ !

కరోనా దెబ్బతో ఫిల్మ్ సిటీకి ఫుల్ డిమాండ్ !

Published on Apr 5, 2020 6:12 PM IST

నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మిగతా షూటింగ్ పార్ట్ ను యూఎస్ లో ప్లాన్ చేసుకుంది. వీసాలు కూడా వచ్చే టైంలో కరోనా వచ్చి షూటింగ్ ఆగిపోయింది. దాంతో వీసాలు కూడా రద్దయ్యాయి. దాంతో కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ ని ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

మొత్తానికి యూఎస్ లొకేషన్స్ అవసరం ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకోనున్నాయి. ఆ రకంగా రామోజీ ఫిల్మ్ సిటీకి ఈ ఏడాది బాగా డిమాండ్ పెరగనుంది. ఇక ‘కళ్యాణ వైభోగమే’లో నాగసౌర్య – మాళవిక నాయర్ జంటగా నటించి ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అలాగే ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా మంచి విజయాలు సాధించాయి.

కాగా ఇప్పుడు చేయబోతున్న ఈ చిత్రం సరి కొత్త ప్రేమ కథతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కొత్త లవ్ స్టోరీతో రిపీట్ కాబోతుంది అన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు