ఏపీ ప్రభుత్వ కరోనా సాంగ్ లో హీరో నిఖిల్.!

ఏపీ ప్రభుత్వ కరోనా సాంగ్ లో హీరో నిఖిల్.!

Published on Jun 4, 2020 3:07 PM IST


ప్రస్తుతం కరోనా మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరు చూస్తూనే ఉన్నారు. దీనితో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు కాస్త దైవిథ్యమానం గానే ఉన్నాయి. దీని మూలాన విధించిన లాక్ డౌన్ కారణంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా స్తంభించిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

దీనితో లాక్ డౌన్ సమయం లో ఎలా ఐతే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇక పై కొనసాగాలని, కరోనా వల్ల, దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనీ అర్ధం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైస్సార్సీపీ రాజ్య సభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఓ పాట ని సిద్ధం చేయించారు.

అయితే ఈ పాటలో నిఖిల్ తో పాటుగా కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, పి వి సింధు తదితరులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి కనిపించిన ఈ కరోనా అవగాహన సాంగ్ కు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ రెడీ చెయ్యగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు