ఓటీటీ: బాహుబలి మేకర్స్ నుంచి వస్తున్న “యక్షిణి” పై మరిన్ని డీటెయిల్స్

ఓటీటీ: బాహుబలి మేకర్స్ నుంచి వస్తున్న “యక్షిణి” పై మరిన్ని డీటెయిల్స్

Published on May 21, 2024 11:00 PM IST

భారతీయ సినిమా తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ చిత్రం “బాహుబలి” మేకర్స్ ఆర్కా మీడియా వర్క్స్ అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఓ క్రేజీ ఫాంటసీ థ్రిల్లర్ గా దీనిని నిర్మాణం వహించారు.

ఇక తాజాగా మరిన్ని డీటెయిల్స్ అందించారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని “యక్షిణి” సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియా ఫాంటసీ నేపథ్యాన్ని ఈ సిరీస్ కు ఎంచుకున్నారు దర్శకుడు తేజ మార్ని.

ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన “యక్షిణి” ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. డైరెక్టర్ తేజ మార్ని విజన్ కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. మరి మన తెలుగు నుంచి రానున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉండబోతోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు