సుకుమార్, విజయ్ దేవరకొండలకు నిర్మాత పూర్తి పారితోషకం ఇచ్చేశారా ?

సుకుమార్, విజయ్ దేవరకొండలకు నిర్మాత పూర్తి పారితోషకం ఇచ్చేశారా ?

Published on Sep 29, 2020 9:01 PM IST

ఈమధ్య కాలంలో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్టుల్లో సుకుమార్, విజయ్ దేవరకొండల చిత్రం కూడ ఒకటి. ఈ కాంబినేషన్ అని తెలియగానే ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ మీద కేదార్ సెలగంశెట్టి నిర్మిస్తున్నారు. సినిమా కొత్తదనానికి నిర్వచనంలా ఉంటుందని టాక్. నిర్మాత కేదార్ సెలగంశెట్టి అయితే ఇదే తన మొదటి సినిమా కావడంతో అన్ని విధాలా చిత్రం గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఉండనుంది.

ఈ సినిమా 2022లో సెట్స్ మీదకి వెళ్లనుంది. సాధారణంగా వేరే నిర్మాతలు అయితే సినిమా ప్రారంభానికి ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అప్పుడే పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించరు. సినిమాను ఓకే చేసుకున్నారు కాబట్టి అనుకున్న పారితోషకంలో 20 నుండి 30 శాతం వరకు అడ్వాన్స్ రూపంలో దర్శకుడు, హీరోకు చెల్లిస్తారు. ఒకసారి అంతా కుదిరి సినిమా మొదలయ్యాక లేదా పూర్తయ్యాకో మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ ఈ సినిమా నిర్మాత మాత్రం సినిమా ఒకే అవ్వగానే అగ్రిమెంట్ చేసుకుని సుకుమార్, విజయ్ దేవరకొండలకు పూర్తి రెమ్యునరేషన్ చెల్లించేశారని టాక్. దీన్నిబట్టి నిర్మాత ఖర్చు, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడరని, ప్రాజెక్ట్ మీద ఆయనకు బోలెడంత నమ్మకం ఉందని అర్థమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు