రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్” మూవీకి U/A సర్టిఫికెట్.. మార్చి 5న రిలీజ్..!

రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్” మూవీకి U/A సర్టిఫికెట్.. మార్చి 5న రిలీజ్..!

Published on Feb 26, 2021 7:00 PM IST


నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో, రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి నిర్మాతలుగా కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం “క్లైమాక్స్”. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో మార్చి 5న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ట్రైలర్‌లో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం కాగా తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్ వాటన్నిటికి సమాధానం చెబుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర్ మాస్టర్, రమేష్ తదితరులు నటించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో “క్లైమాక్స్” సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ ఇలా అన్ని ఈ సినిమాలో ఉన్నాయని, మునుపెన్నడు చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో మార్చ్ 5 న మీ ముందుకు వచేస్తున్నామని ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రంపై అంచనాలను పెంచేసాయని, మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ ఖచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు