ఆ డైరెక్టర్ కి నో చెప్పిన సాయి పల్లవి?

ఆ డైరెక్టర్ కి నో చెప్పిన సాయి పల్లవి?

Published on Jun 4, 2020 11:05 PM IST


దర్శకుడు తేజా హీరో గోపించంద్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. యాక్షన్ హీరో గోపి చంద్ కోసం ఆయన ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అలాగే ఈ సినిమాలో గోపి చంద్ కి జోడిగా సాయి పల్లవిని తీసుకోవాలని తేజా ఆలోచన అట. ఈ ప్రాజెక్ట్ కొరకు తేజా సాయి పల్లవిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారని టాక్.

సాధారణంగా తేజా సినిమాలలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. హీరో పాత్రకు సమానమైన ప్రాధాన్యం హీరోయిన్ పాత్రలకు ఆయన ఇస్తారు. అలాంటిది మరి ఏ కారణంతో ఆమె నో చెప్పారో తెలియదు. ఇక తేజ గతంలో అలివేలుమంగ వెంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు అనే రెండు టైటిల్స్ రిజిస్ట్ చేయించారు. మరి వీటిలో ఈ సినిమా గోపి చంద్ తో ఆయన చేస్తున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు