ఆ ఘటనపై సాయి పల్లవి ఆవేదన..!

ఆ ఘటనపై సాయి పల్లవి ఆవేదన..!

Published on Jul 3, 2020 10:46 PM IST


హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జరిగిన ఓ అమానుష సంఘటన గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఆమె ప్రంపంచాన్నే ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులోని పుదుకొట్టాయ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారి జయ ప్రియపై లైంగిక దాడి చేసి చంపేసిన ఘటన పట్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి గురయ్యి దారుణంగా హత్యగావింపడింది. ప్రస్తుతం సోషల్‌ ఈ సంఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి తన ఆవేదన ఇలా తెలియజేసింది.

సాయి పల్లవి తన ట్విట్టర్ లో ‘బలహీనులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తూ బలహీనులను బాధపెడతాము. మా రాక్షసానందం కోసం చిన్నారులను బలి తీసుకుంటాము. ఈ ఘటనలతో మానవజాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో విషయం చెప్తుంది. మన జాతి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తు చేస్తోంది. ఈ అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. పనికిరాని జీవితం. చిన్నారులను కాపాడలేకపోతున్నాం.. కనుక మరో బిడ్డను ఈ రాక్షసలోకంలోకి తీసుకు వచ్చే అర్హత కోల్పోయాం. ఓ దారుణం గురించి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు లేదా మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, పట్టించుకోని నేరాల విషయంలో ఏం చేద్దాం’ అని ప్రశ్నించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు