హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జరిగిన ఓ అమానుష సంఘటన గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఆమె ప్రంపంచాన్నే ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులోని పుదుకొట్టాయ్లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారి జయ ప్రియపై లైంగిక దాడి చేసి చంపేసిన ఘటన పట్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి గురయ్యి దారుణంగా హత్యగావింపడింది. ప్రస్తుతం సోషల్ ఈ సంఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి తన ఆవేదన ఇలా తెలియజేసింది.
సాయి పల్లవి తన ట్విట్టర్ లో ‘బలహీనులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తూ బలహీనులను బాధపెడతాము. మా రాక్షసానందం కోసం చిన్నారులను బలి తీసుకుంటాము. ఈ ఘటనలతో మానవజాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో విషయం చెప్తుంది. మన జాతి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తు చేస్తోంది. ఈ అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. పనికిరాని జీవితం. చిన్నారులను కాపాడలేకపోతున్నాం.. కనుక మరో బిడ్డను ఈ రాక్షసలోకంలోకి తీసుకు వచ్చే అర్హత కోల్పోయాం. ఓ దారుణం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినప్పుడు లేదా మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, పట్టించుకోని నేరాల విషయంలో ఏం చేద్దాం’ అని ప్రశ్నించారు.
With every passing day it looks like nature is telling us that our race needs to be wiped clean, for living such a pathetic life where we watch such incidents happen but still be so useless!!! This inhumane world doesn’t deserve to birth another Child !
— Sai Pallavi (@Sai_Pallavi92) July 3, 2020