బాలీవుడ్ లో రీమేక్ కానున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా..?

బాలీవుడ్ లో రీమేక్ కానున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా..?

Published on Jul 15, 2020 10:25 PM IST

మన తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మన దగ్గర చిన్నగా విడుదలై సెన్సేషన్ రేపే ఏ సినిమాను కూడా వారు వదలరు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అక్కడ రీమేక్ చేయడానికే వారు ప్రయత్నిస్తారు. అలా ఈరోజు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ హిట్ చిత్రం “హిట్ ది ఫస్ట్ కేస్” రీమేక్ అవ్వనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పుడు మన దగ్గర హిట్ అయిన మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “మత్తు వదలరా” అక్కడ రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీనితో ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ కానున్నట్టు ఇప్పుడు సమాచారం. నిజానికి ఈ చిత్రాన్ని మొదట్లోనే రెండు భాషల్లో తెరకెక్కించాలని అనుకున్నారట.

కానీ అప్పుడు కుదరక పోవడంతో ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్ కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ద్వారా మన టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా పరిచయం కాగా మరో తనయుడు మరియు ప్రముఖ సింగర్ కాల భైరవ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు