ఆనంద్ నా వాయిస్ తో ప్రాంక్ చేసేవాడు – విజయ్ దేవరకొండ

ఆనంద్ నా వాయిస్ తో ప్రాంక్ చేసేవాడు – విజయ్ దేవరకొండ

Published on May 21, 2024 8:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. ఈ క్రేజీ మూవీ మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.

ఈ ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ ల వాయిస్ లు దాదాపుగా సేమ్ గా ఉంటాయి అని విజయ్ ఫోన్ కాల్ లో ప్రెస్ కి తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్స్ ను ప్రాంక్ చేసేవాడు ఆనంద్ అని విజయ్ అన్నారు. అయితే రిలీజైన గం గం గణేశా మూవీ ట్రైలర్ చాలా బాగుంది అని, కన్ఫ్యూజన్ గా, కామెడీ గా ట్రైలర్ ఉంది అని అన్నారు. అంతేకాక ఆనంద్ పెర్ఫార్మెన్స్ బాగుంది అని అన్నారు.

ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు