సినీ ప్రముఖులు అందరు ఫాన్స్ కి దగ్గరగా ఉండటానికి ఉపయోగించే మాధ్యమం ట్విట్టర్. పవన్ కళ్యాణ్ వీరికి భిన్నంగా ట్విట్టర్ కి దూరంగా వున్నారు. ఈ విషయమై పంజా ప్రమోషన్
కోసం యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యలో పవన్ కళ్యాణ్ ని అడగగా, ఏమని ట్వీట్ చెయ్యాలి “ఇపుడే షూటింగ్ నుండి వచ్చాను, అలిసిపోయాను, కాళ్ళు జాపుకున్నాను” అవన్నీ చెప్పటం చాలా సులభం కాని ఎక్కువ రోజులు నటించాలేము. ఒకవేళ నటిస్తుంటే తొందరగా అలిసిపోతాం. ఈ ఇంటర్వ్యూ అన్ని మీడియా చానల్స్ లో ప్రసారమవుతుంది. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇంటర్వ్యూ ఇది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం పొల్లాచ్చి కి వెళ్ళిపోయారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్సకత్వం వహిస్తుండగా, శ్రుతి హసన్ హీరోయిన్ గా చేస్తుంది. పంజా డిసెంబర్ 9న విడుదలకి సిద్ధమయింది.