వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “భీమ్లా నాయక్”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “భీమ్లా నాయక్”

Published on May 1, 2022 3:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అంతేకాక ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. మే 8, 2022 న స్టార్ మా లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు