‘ఆహా’లో స్ట్రీమ్ కానున్న అరుళ్‌నిధి “రేయికి వేయి కళ్లు”.!

ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా కూడా ప్రేక్షకులందరూ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. అలా ఓటీటీలతో భాషాబేధం లేకుండా పోయింది.అయితే అలా ఇతర భాషల్లో మంచి కంటెంట్ ని అయితే తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు ముందుండే ‘ఆహా’ ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 30 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

డీమోంటీ కాలనీ, డేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. ప్రస్తుతం అరుళ్‌నిధి.. రేయికి వేయి కళ్లు అనే సినిమాతో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విజయవంతంగా యాభై రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షుకులు, విమర్శకులు అందరూ కూడా సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది.

ఇక ఈ చిత్రం కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్‌ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

రాక్షసన్ (తెలుగులో రాక్షసుడు) సినిమాను నిర్మించిన యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, డిల్లీ బాబులు ‘రేయికి వేయి కళ్లు’ చిత్రాన్ని నిర్మించారు. శామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ, శాన్ లోకేష్ ఎడిటింగ్ ఈ చిత్రం విజయంలో మంచి హైలైట్స్ గా నిలిచాయి.

Exit mobile version