హీరోయిన్ రష్మిక మందన్నాకి సంబంధించి ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ డీప్ఫేక్ వీడియో కేసులో కీలక నిందితుడిని నిన్న అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అతడే రష్మిక వీడియోను సృష్టించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా తన డీప్ఫేక్ వీడియో సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై హీరోయిన్ రష్మిక స్పందించారు.
పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని ఆమె అన్నారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గతేడాది. నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి.. ఆమెను బాధ పెట్టారంటూ కేసు నమోదు అయ్యింది.