సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటలోని మాస్ స్టెప్స్ కి ఆడియెన్స్ నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ పాటలో పూర్ణ చేసిన రోల్ కి రష్మీ గౌతమ్ ను ముందుగా సంప్రదించినట్లు వస్తున్న వార్తల పై ఆమె స్పందించారు. అలా తను రిజెక్ట్ చేయలేదు అని పేర్కొంది. అంతేకాక ఇలాంటి అవాస్తవాలని నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చారు. పూర్ణ పెర్ఫార్మెన్స్ ఈ పాటలో చాలా ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, శ్రీ లీల లతో పాటుగా పలు స్టెప్స్ పూర్ణ పై కూడా ఉన్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.
This news is absolutely baseless
I was not approached so no scope for rejection
Also poorna garu did an absolute fab job no one else could have done it better
Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024