సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన రెండు రోజుల క్రితం థియేటర్ల లోకి వచ్చింది. మల్టిపుల్ జానర్ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రెండో రోజు 7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. మూడు రోజుల్లో మొత్తం 20.30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.
మేకర్స్ విడుదలకు రెండు రోజుల ముందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక ప్రీమియర్లను షెడ్యూల్ చేసారు మరియు ఈ కలెక్షన్లు ప్రీమియర్లను కలుపుకొని ఉన్నాయి. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా చిత్రాన్ని నిర్మించారు. భాను భోగవరపు కథ అందించగా శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు.