ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. ఇప్పటికే రెండు సీజన్స్తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్తో మన ముందుకు రానుంది. జూన్ 7 నుంచి ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో ప్రేక్షకులను అలరించనుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో హోస్ట్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ, ఇండియన్ ఐడల్ 3 సీజన్లో మళ్లీ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్కు సంబంధించిన ఆడిషన్స్ జరిగినప్పుడు చాలా మంది కేవలం సింగర్స్ మాత్రమే కాదు, చాలా మంది సంగీత కళాకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి గొప్ప మాధ్యమంలో ఇంకా కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది అని అన్నారు.
సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చేసిన తర్వాత సీజన్ 3కి కాల్ వస్తుందని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వచ్చింది. మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉపయోగించుకుని ప్రతిభను చాటుకుంటారో చూడాలి అని అన్నారు. ఆహా నుంచి రాకేష్ మాట్లాడుతూ, తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో యు.ఎస్లో ఆడిషన్స్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.
సింగర్ కార్తీక్ మాట్లాడుతూ, ఇండియన్ ఐడల్ సీజన్ 3లో యంగ్ టాలెంటెడ్ సింగర్స్ మాత్రమే కాదు, ఏదో సాధించాలనే తపన ఉన్నవాళ్లు వచ్చారు. సీజన్ 3 చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది అని అన్నారు. ప్రీమాంటల్ ఇండియా ఆరాధన మాట్లాడుతూ, తమన్, కార్తీక్, గీతామాధురి, శ్రీరామచంద్ర చాలా మందికి స్ఫూర్తినిస్తూ ఎంకరేజ్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. సీజన్ 3లో మన తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్ వరకు వెళ్లాం. గొప్ప టాలెంట్ను పరిచయం చేయబోతున్నాం అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ, గత రెండు సీజన్స్ కంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్ను ఎంపిక చేశాం. నన్ను నమ్మి ఇండియన్ ఐడల్ లో జడ్జిగా పెట్టిన అరవింద్గారికి, ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్గారికి ఈ సందర్భంగా థాంక్స్. ప్రీమాంటల్ టీమ్కి థాంక్స్. జూన్ 7 నుంచి ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రారంభం కానుంది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆహా నుంచి రాజశేఖర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.