పవర్ స్టార్ పవర్ ఫుల్ “భీమ్లా నాయక్” ఓఎస్టీ రిలీజ్ కి డేట్ ఫిక్స్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ఫిబ్రవరి 25, 2022 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. రానా దగ్గుపాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

ఈ చిత్రం కి సంబందించిన ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) పై థమన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. జూన్ 28, 2024 న సాయంత్రం 4:05 గంటలకు 70 ట్రాక్ లతో కూడిన ఓఎస్టీ ను రిలీజ్ చేయనున్నారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది సంతోషం కలిగించే వార్త అని చెప్పాలి. ఈ చిత్రం ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.

Exit mobile version