ఓటిటి స్ట్రీమింగ్ కు వ‌స్తున్న ”ధూమం”

మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ న‌టించే సినిమాల‌కు ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయ‌న న‌టించే సినిమాలు కంటెంట్ బేస్డ్ గా ఉంటాయి కాబ‌ట్టి అభిమానులు వాటిని ఆద‌రిస్తుంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన ‘పుష్ప’ చిత్రంతో ఆయ‌న టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

కాగా, ఆయ‌న న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘ధూమం’ గ‌తంలోనే రిలీజ్ అయినా అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ కొన్ని కార‌ణాల‌తో ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు మేక‌ర్స్.

‘ధూమం’ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో జూలై 11 నుండి స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తుంద‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అప‌ర్ణ బాల‌ముర‌ళి, రోష‌న్ మాథ్యూ, పార్వ‌తి నాయ‌ర్, దేవ్ మోహ‌న్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను ప‌వ‌న్ కుమార్ డైరెక్ట్ చేయ‌గా హొంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version