మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను యదు వంశీ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్ర టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నన్ను పిలిచి ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగమయ్యేలా చేసిన నిహారిక గారికి థాంక్స్. ఇది చిన్న చిత్రం కాదని అర్థమైంది. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. యదు గారికి ఇది మొదటి సినిమాలా అనిపించడం లేదు. నిహారిక మల్టీ టాలెంటెడ్. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలను ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.’ అని అన్నారు.
ఇక నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘పిలిచిన వెంటనే వచ్చిన సిద్దుకి థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ‘మా సినిమాలో నటించిన 11 మంది కూడా సిద్దు గారిలానే ఎంతో కష్టపడుతుంటారు. మా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత బాగా తీయగలిగాను. నిహారిక గారు, ఫణి గారు లేకపోతే మూవీని ఇంత బాగా తీసేవాళ్లం కాదు. ఆగస్ట్ 9న మా సినిమా థియేటర్లోకి రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ‘మా కమిటీ కుర్రోళ్లు టీంకు కంగ్రాట్స్. చాలా మంచి చిత్రాన్ని తీశాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్ను రిలీజ్ చేసిన సిద్దు గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది.’ అని అన్నారు.