యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘మత్తు వదలరా 2’ సెన్సేషన్

టాలీవుడ్‌లో తెరకెక్కిన కామెడీ క్రైమ్ ఎంటర్‌టైనర్ సీక్వెన్స్ మూవీ ‘మత్తు వదలరా 2’ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. రితేశ్ రానా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీ సింహా, సత్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. వీకెండ్‌లో ఈ సినిమా అక్కడ మంచి రన్ కొనసాగించింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వీకెండ్ ముగిసే సరికి 650K డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఈ నెంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లో లేడీ లీడ్ రోల్‌లో నటించింది. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version