తెలుగులో భారీ సినిమాని సొంతం చేసుకున్న మైత్రి సంస్థ.!

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కన్నడలో ఎప్పుడు నుంచో భారీ హైప్ ని సొంతం చేసుకున్న క్రేజీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “మార్టిన్” కూడా ఒకటి. దృవ సార్జా హీరోగా దర్శకుడు ఏపీ అర్జున్ తెరకెక్కించగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

ఇప్పుడు తెలుగులో ఎవరు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అనేది రివీల్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టుగా ఇపుడు అప్డేట్ అందించారు. మరి తెలుగు ఆడియెన్స్ లో మంచి యాక్షన్ సినిమాలకి కూడా మంచి క్రేజ్ ఉంది ఇక ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version