ఓటీటీలోకి వచ్చేసిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’

టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేశ్ లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ మూవీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.

ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసే విధంగా ఉంటుందని మేకర్స్ మరోసారి చెబుతున్నారు.

ఈ సినిమాలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా..కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. మరి ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ ఆడియెన్స్‌ని ఎంతమేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version