SDT18: భారీ సెట్‌లో సుప్రీమ్ హీరో నెక్స్ట్ షెడ్యూల్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ ప్రస్తుతం తన కెరీర్‌లోని 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను రోహిత్ కెపి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించింది. ఇందులో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, SDT18 నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 12 ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ మూవీగా రానుంది.

సరికొత్త కాన్సెప్ట్‌తో మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇందులో మాస్ అవతారంలో ఆయన కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version