Pawan Kalyan: కార్తి క్షమాపణలపై పవన్ రిప్లై

తమిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన లడ్డూ గురించి చేసిన కామెంట్ ఎలాంటి వివాదానికి దారితీసిందో అందరికీ తెలిసిందే. ఆయన ‘‘లడ్డూ గురించి ఇప్పుడొద్దు.. అది సెన్సిటివ్ టాక్..’’ అని కామెంట్ చేయడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు మీడియా సమక్షంలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లడ్డూ అనేది సినిమా వారికి కూడా కామెడీగా మారిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్తి ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరాడు. తాను చేసిన కామెంట్ కావాలని చేయలేదని.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానంటూ కార్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, కార్తి క్షమాపణలు కోరడంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. అయితే, తాజాగా పవన్ కార్తి క్షమాపణలకు రిప్లై ఇచ్చారు.

‘‘వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. మన సంప్రదాయాలకు నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం బాగుంది. అయితే తిరుపతి, లడ్డూ లాంటివి కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలు. అలాంటి వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఫిగర్లుగా మనం వేదికలపై ఏం మాట్లాడుతున్నామనేది ఆచితూచి మాట్లాడాలి. మన సంప్రదాయాలను గౌరవిస్తూ, సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. త్వరలో రిలీజ్ కాబోతున్న మీ కొత్త సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నా.’’ అంటూ పవన్ రిప్లై ఇచ్చారు.

Exit mobile version