శ్రోతల్ని మెప్పిస్తున్న “విశ్వం” నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి స‌మ‌ర్ప‌ణ‌లో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్ మీడియా బ్యాన‌ర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పుడు సినిమా నుంచి మేకర్స్ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని వదిలారు అని చెప్పాలి. ఫస్ట్ సింగిల్ గా క్రేజీ బీట్స్ తో కూడిన డ్యూయెట్ ని చేతన్ భరద్వాజ్ అందిస్తే ఇది దానికి పూర్తిగా భిన్నంగా వినేందుకు ఫీల్ గుడ్ వైబ్స్ లో ఉందని చెప్పాలి. తల్లి కూతుళ్ళ మధ్య సాగే సాంగ్ గా చేతన్ భరద్వాజ్ మంచి స్వరాలు ఈ పాటకి అందించారు.

అలాగే శ్రీ హర్ష ఈమని సాహిత్యం ఈ సాంగ్ లో చాలా బాగుందని చెప్పాలి. దీనితో ఈ సాంగ్ ని విన్న శ్రోతలు మాత్రం మంచి సాంగ్ ని అందించారని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ వారు నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 11న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version