“మంగళవారం” దర్శకునితో విక్రమ్ వారసుడు భారీ ప్రాజెక్ట్?

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ దర్శకుల్లో తన మొదటి సినిమా తోనే సత్తా చాటిన టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒకరు. మరి అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “మంగళవారం” పెద్ద హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీసెంట్ గానే ఇండియన్ ఫెడరేషన్ తరపు నుంచి ఆస్కార్ నామినేషన్స్ కి కూడా వెళ్ళింది. మరి ఈ సినిమా దర్శకుడు కోలీవుడ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తో భారీ సినిమా చేస్తున్నట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది.

మరి ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టాడు. అలాగే ఈ చిత్రం తర్వాత తన తండ్రితో “మహాన్” సినిమాలో విలన్ గా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే మినిమమ్ అంచనాలు పెట్టుకోవచ్చు. మరి ఈ క్రేజీ కలయికలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

Exit mobile version