ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటించిన రీసెంట్ మూవీ ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో గొర్రె పురాణం చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తాజాగా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆహాలో ఈ సినిమా వస్తుండటంతో, ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రఘు బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పవన్ సిహెచ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version