‘విశ్వం’ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్ చేసిన గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

‘విశ్వం’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని అక్టోబర్ 6న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో గోపీచంద్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు శ్రీను వైట్ల వింటేజ్ మార్క్ కామెడీ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version