త్రిపాత్రాభినయంలో స్టార్ హీరోయిన్ ?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఐతే, ‘కంగనా రనౌత్’ సినీ కెరీర్ లో ‘తను వెడ్స్‌ మను’ చిత్రం స్పెషల్ గా నిలిచిపోతుంది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాలో కంగనా రనౌత్, ఆర్‌.మాధవన్‌ అద్భుతంగా నటించి మెప్పించారు. ఐతే, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

దీంతో, ఇప్పుడు ‘తను వెడ్స్‌ మను’ మూడో పార్ట్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌లో ‘తను వెడ్స్‌ మను 3’ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ మూడో పార్ట్ లో కంగనా త్రిపాత్రాభినయం చేయబోతుందట. ‘కంగనా తొలిసారి తన కెరీర్‌లో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతుంది. పైగా ఆమె ఇప్పుడు భాజపా ఎంపీ కూడా. అందుకే, ఈ మధ్య ‘కంగనా రనౌత్’ కి క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే కంగనా త్రిపాత్రాభినయం వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

Exit mobile version