రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నటించిన ‘ఎర్రచీర’.. డిసెంబర్ 20న రిలీజ్!

శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ – శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ సినిమాలో 45 నిమషాలు గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో సుమన్ బాబు స్వీయ దర్శకత్వం చేస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాను మథర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్‌తో రూపొందించినట్లు నిర్మాత ఎన్.వి.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని, క్లైమాక్స్‌లో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెప్పిస్తుందని, కారుణ్య చౌదరి సరికొత్తగా కనిపించబోతుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఎస్.చిన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్ అందించారు.

Exit mobile version