పెళ్లిపనుల్లో ‘చైతు -శోభితా’.. పోస్ట్ వైరల్ !

హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి నిశ్చితార్థం వేడుక కూడా జరిగింది. అయితే, తాజాగా ఈ జంట పెళ్లి పనులు మొదలు అయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

శోభితా ధూళిపాళ్ల ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభితా ధూళిపాళ్ల మెరిసిపోతూ కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంది. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో చెప్పాలని నెటిజన్లు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

Exit mobile version