టీవీ ప్రీమియర్‌కి సిద్ధమైన ‘డబుల్ ఇస్మార్ట్’

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో దర్శకుడు పూరి జగన్నాధ్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే, సినిమాలో ప్రేక్షకులను మెప్పించే అంశాలు లేకపోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో అక్టోబర్ 27న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో, ఓటీటీలో చూడని వారు టీవీలో చూసి ఎంజాయ్ చేయొచ్చని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు.

డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version