భారీ ధర పలికిన భారీ సినిమా.. వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్ !

భారీ ధర పలికిన భారీ సినిమా.. వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్ !

Published on May 3, 2022 1:42 AM IST

మ్యాజికల్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలల సంకలనం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దర్శకులు ఈ నవలను సినిమాగా తీయాలని అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ పని చేస్తున్నారు.

ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది అని తెలుస్తోంది.

‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండు భాగాల డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ. 125 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది. యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు