మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి విష్ణు మంచు “మోసగాళ్ళు”

మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి విష్ణు మంచు “మోసగాళ్ళు”

Published on Sep 14, 2022 10:14 PM IST

టాలీవుడ్ హీరో విష్ణు మంచు పాన్ ఇండియన్ తొలి చిత్రం మోసగాళ్లు గతేడాది విడుదలైంది. ప్రపంచం లోనే అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ టెక్ థ్రిల్లర్‌ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విష్ణు సోదరిగా నటించింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా ఈ శుక్ర‌వారం నుంచి ఆహాలో కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటన చేశారు. సునీల్ శెట్టి, నవదీప్, రుహీ సింగ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. అమెరికన్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు స్వయంగా నిర్మించారు. సామ్ సిఎస్ ఈ సినిమా కి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు