ఫోక్ సింగర్ మంగ్లీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. వరుస హిట్ సాంగ్స్ తో ఆమె ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లేడీ ఫోక్ సింగర్ గా మారారు. ఇక ఆమె పాడిన పాటలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఆమెతో కనీసం ఓ ఫోక్ సాంగ్ పాడిస్తే, తమ సినిమాకు మంచి బూస్ట్ వస్తుందని టాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నారు. అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సింగర్ తాజాగా మరో కొత్త సాంగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
‘ధూంధాం’ అనే కొత్త మూవీలో ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి రాసిన ‘మల్లె పూల టాక్సీ’ అనే పెప్పీ సాంగ్ ను మంగ్లీ పాడారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ పాట ప్రోమో అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు.
ఇక ‘ధూంధాం’ సినిమాలో చేతన్ కృష్ణ హీరోగా నటిస్తోండగా, అందాల భామ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మచ్చ సాయి కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా.. ఫ్రైడే ఫ్రేంవర్క్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై ఎంఎస్.రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ‘మల్లె పూల టాక్సీ’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను జూన్ 5న ఉదయం 9.18 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి