పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన గోపీచంద్ – స‌న్నీ డియోల్ మూవీ

పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన గోపీచంద్ – స‌న్నీ డియోల్ మూవీ

Published on Jun 20, 2024 12:00 PM IST

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేస్తూ ఓ క్రేజీ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ మూవీని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీ డియోల్ ఇందులో లీడ్ రోల్ లో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఈ చిత్రాన్ని ప్రారంభించారు మేక‌ర్స్.

పూజా కార్య‌క్రమాల‌తో ఈ సినిమాను మేక‌ర్స్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వానికి హీరో స‌న్నీ డియోల్ తో పాటు హీరోయిన్ రెజీనా క్యాసాండ్ర‌, స‌యామీ ఖేర్ లు కూడా హాజ‌ర‌య్యారు. పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించ‌నున్నారు.

ఇక ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, రిషి పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వీన్ నూలి ఈ సినిమాకు ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు