సైలెంట్ గా ఓటిటిలోకి వ‌చ్చేసిన ‘గం గం గ‌ణేశా’!

సైలెంట్ గా ఓటిటిలోకి వ‌చ్చేసిన ‘గం గం గ‌ణేశా’!

Published on Jun 20, 2024 1:00 PM IST

యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన రీసెంట్ మూవీ ‘గం గం గ‌ణేశా’ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. మే 31న రిలీజ్ అయిన ఈ సినిమాను ఉద‌య్ బొమ్మిశెట్టి డైరెక్ట్ చేశారు. పూర్తి క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కులను అల‌రించింది. అయితే, ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూశారు.

అంద‌రికీ స‌ర్ ప్రైజ్ ఇస్తూ, ‘గం గం గ‌ణేశా’ మూవీ సైలెంట్ గా ఓటిటిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం గురువాం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆస‌క్తిని చూపుతున్నారు.

ఇక ఈ సినిమాలో న‌య‌న్ సారిక‌, ప్ర‌గ‌తి శ్రీ‌వాస్త‌వ హీరోయిన్లుగా న‌టించ‌గా.. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయెల్, రాజ్ అర్జున్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ల‌భిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు