చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మాతగా సురేష్ లంకలపల్లి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘రాచరికం’. ఈ సినిమాలో అందాల భామ అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా అప్సరా రాణి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది.
ఉగ్రరూపంలో అప్సరా రాణి కనిపించడంతో, ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కంటెంట్, సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వెంగి సంగీతాన్ని అందిస్తుండగా, ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.