సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే వారికి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ దొరకడం ఈజీ. అలా చాలా మంది సోషల్ మీడియా స్టార్స్ బిగ్ బాస్ షోలో కనిపించారు. ఇక ఇప్పుడు తన జ్యోతిష్యంతో సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ అవుతూ ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.
సినీ ప్రముఖులు, రాజకీయ నేతలకు సంబంధించిన జ్యోతిష్యం చెబుతూ ఓ పక్క వైరల్ అవుతూనే, మరో పక్క వివాదాల్లో చిక్కుకున్నారు వేణు స్వామి. ఆయన ఇటీవల వైఎస్.జగన్ కు సంబంధించి చెప్పిన జ్యోస్యం తప్పు కావడంతో ఆయన రాజకీయాలకు సంబంధించిన జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు. ఇక సినీ సెలబ్రిటీలతో వేణు స్వామి పూజలు చేయిస్తూ కనిపించిన ఫోటోలు మనకు నెట్టింట కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఆయన పాపులారిటీని బిగ్ బాస్ నిర్వాహకులు వాడుకోవాలని చూస్తున్నారు.
త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 8 లో వేణు స్వామిని తీసుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే, ఈ షోలో పాల్గొనేందుకు వేణు స్వామి భారీ రెమ్యునరేషన్ కోరారని.. దీనికి షో నిర్వాహకులు కూడా ఓకే తెలిపారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ షోలో ఇప్పటికే బర్రెలక్క, కుమారి ఆంటీ, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి లాంటి వారు కూడా పాల్గొంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి ఎంట్రీ కూడా దాదాపు ఖరారే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు షోను వీక్షించే అభిమానులు.