ఓటిటి పార్ట్నర్ ని కన్ఫర్మ్ చేసుకున్న “మనమే”

ఓటిటి పార్ట్నర్ ని కన్ఫర్మ్ చేసుకున్న “మనమే”

Published on Jul 6, 2024 11:03 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మనమే” కోసం తెలిసిందే. మరి డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత కూడా ఓటిటి పార్ట్నర్ ఎవరు ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు.

మధ్యలో డిస్నీ+ హాట్ స్టార్ లో వస్తుందని బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు అయితే లేటెస్ట్ క్లారిటీ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారట. సో కొన్ని రోజుల్లోనే ఈ సినిమా అందులో స్ట్రీమింగ్ కి రానుంది అని చెప్పాలి. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు