అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బడ్డీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను శామ్ ఆంటోన్ డైరెక్ట్ చేస్తుండగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
కాగా, ఈ సినిమా నుండి ‘ఫీల్ ఆఫ్ బడ్డీ’ అనే పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట బ్రేకప్ సాంగ్ గా ఎమోషనల్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటోంది. ”చూశాలే.. చూశాలే..” అంటూ సాగే ఈ పాటకు సాయి హేమంత లిరిక్స్ అందించారు. ఇక ఈ పాటకు హిప్ హాప్ తమిళ అద్భుతమైన సంగీతం అందించడంతో పాటు ఐరా ఉడిపితో కలిసి పాడారు. ఈ పాటను వింటున్న ఆడియెన్స్ ఇది చాలా హార్ట్ టచింగ్ గా ఉందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి