హైదరాబాద్‌ లో దిగిన ‘భారతీయుడు 2’

హైదరాబాద్‌ లో దిగిన ‘భారతీయుడు 2’

Published on Jul 7, 2024 7:07 PM IST

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. జూలై 12, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చిత్రబృందం ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ‘భారతీయుడు2’ టీమ్ హైదరాబాద్‌లో ల్యాండయింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో కాసేపట్లో ప్రారంభమయ్యే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో టీమ్ పాల్గొని సందడి చేయబోతుంది.

కమల్ హాసన్ లీడ్ రోల్‌లో రాబోతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.350కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు