ఆ నిర్మాత మృతి.. ఆలస్యంగా వెలుగులోకి

ఆ నిర్మాత మృతి.. ఆలస్యంగా వెలుగులోకి

Published on Jul 7, 2024 7:05 PM IST

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాన్ లాండౌ ఇక లేరు. 63 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ రెండు రోజుల కిందట మరణించారు. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ విన్నింగ్ సినిమాలు టైటానిక్, అవతార్‌, అవతార్: ద వే ఆఫ్ వాటర్‌ను ఆయన నిర్మించి పేరు తెచ్చుకున్నారు.

పైగా, 2026, 2030లో విడుదల కానున్న అవతార్ 3, 4 చిత్రాలకు కూడా ఆయనే నిర్మాత కావడం విశేషం. తన విలక్షణమైన అభిరుచితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత జాన్ లాండౌ. ఆయన మృతి పట్ల ప్రముఖులు, సినీ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున జాన్ లాండౌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు