అక్టోబర్ 25న రిలీజ్ కానున్న ‘లగ్గం’ మూవీ!

అక్టోబర్ 25న రిలీజ్ కానున్న ‘లగ్గం’ మూవీ!

Published on Sep 28, 2024 10:15 AM IST

సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, నేడు ‘లగ్గం’ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్ర టీజర్ చూసిన సుధీర్ బాబు చాలా బాగుందని ప్రశంసించారు. ‘లగ్గం’ టీమ్ మొత్తానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ తెలుగు సినిమాలో నటీనటులు తెలంగాణ యాస కాకుండా వాడుక భాషలో మాట్లాడుతారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని.. ఇది ‘లగ్గం’ నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లగ్గం’ సినిమా అక్టోబర్ 25న వరల్డ్‌వైడ్‌గా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ.శ్రీరామ్, కృష్ణుడు, తదితరులు నటించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు