యూట్యూబర్స్ పై లోకేష్ కనగరాజ్ ఫైర్..

యూట్యూబర్స్ పై లోకేష్ కనగరాజ్ ఫైర్..

Published on Oct 5, 2024 9:02 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి అనౌన్స్మెంట్ నాటి నుంచి భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అన్నట్టుగా కూడా టాక్ వచ్చింది. అయితే అనూహ్యంగా రజినీకాంత్ అనారోగ్యానికి గురి కావడం ఊహించనిదిగా మారింది.

అయితే రజినీకాంత్ ఆరోగ్యం కూలీ షూటింగ్ వల్లే పాడైంది అని తాను షూటింగ్ లో ఉన్నపుడే అస్వస్థతకి లోనయ్యారాని యూట్యూబర్స్ వార్తలు ప్రచారం చేశారు. అయితే దీనిపై లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. యూట్యూబర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఫేక్ వార్తలని అమ్మేస్తున్నారని రజినీ గారి సర్జరీ ముందే ప్లాన్ చేసుకోబడింది. అంతే కానీ తలైవర్ కూలీ షూటింగ్ లో ఏమీ అస్వస్థతకి లోను కాలేదు. అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా మీడియా కన్వర్జేషన్ లో తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు