షాకింగ్: రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..

షాకింగ్: రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..

Published on Oct 5, 2024 9:45 AM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి సీనియర్ వెర్సటైల్ నటుల్లో ప్రముఖ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. మరి తెలుగు సినిమాలో కామెడీ జానర్ కి ఒక కొత్త నిర్వచనంలా మారిన తాను ఇప్పుడు మరిన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే వారికి సంబంధించి ఇప్పుడు ఓ విషాద వార్త అయితే బయటకి వచ్చింది.

రాజేంద్ర ప్రసాద్ గారి తనయురాలు గాయత్రి తన 38 వ ఏట కన్ను మూసిన వార్త ఇపుడు వారి ఇంట తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. అయితే గాయత్రి ఇంత చిన్న వయసులో గుండె పోటు రావడం కారణంగా కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. ఈ విషాద ఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలిపోయారట, తన గారాల పట్టి ఇక లేదు అని కన్నీరు మున్నీరు అవుతున్నారట.

అయితే గాయత్రీ ఒక న్యూట్రిషన్ అడ్వైజర్ గా పని చేస్తుండగా తన భర్త మహేంద్ర అండ్ మహేంద్రలో వర్క్ చేస్తున్నారు. అలాగే వారి కూతురు రాజేంద్ర ప్రసాద్ తో మహానటి సినిమాలో లో చిన్ననాటి మహానటి పాత్రలో కనిపించింది. మరి ఈ లోటు మాత్రం రాజేంద్ర ప్రసాద్ కి వారి ఇంట ఎవరూ తీర్చలేని లోటు అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు