ఆయన హ్యూమరే నాకు వచ్చింది – శ్రీను వైట్ల

ఆయన హ్యూమరే నాకు వచ్చింది – శ్రీను వైట్ల

Published on Oct 7, 2024 7:02 AM IST

దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘విశ్వం’. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కామెడీ టైమింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీను వైట్ల ఏం మాట్లాడారు అంటే.. ‘నాలోని హ్యూమర్ ని నా చుట్టూ ఉన్న వారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఐతే, నాకు ఆ హ్యూమర్ రావడానికి కారణం మా ఇంట్లో నేను పెరిగిన వాతావరణమే. మా నాన్నగారు, మా పెద్దనాన్న గారు వీళ్ళిద్దరికీ కూడా బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వాళ్ళు ఊరిలో మనుషులతో డీల్ చేసే విధానం చాలా సరదాగా ఉంటుంది.

ముఖ్యంగా మా పెద్దనాన్న గారి క్యారెక్టర్ చాలా సరదాగా ఉంటుంది. బహుశా ఆయన హ్యూమరే, ఆయన టైమింగే నాకు వచ్చి ఉంటుంది’ అంటూ శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. ఇక విశ్వం కథలో భాగంగా ఒక ట్రావెల్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. ఐతే, ‘వెంకీ’ ట్రైన్‌ ఎపిసోడ్‌ కంటే.. ఈ ఎపిసోడ్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే, ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ను ఇటలీ, రోమ్, గోవా తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవి కూడా చాలా సహజంగా ఉంటాయట. కాగా విశ్వం చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్ మరియు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు